నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ హెచ్చరిక.
అనుమతి, లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మాంసం విక్రయాలు.
రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో విక్రయాలు నిషేధం.. ఆదివారాల్లో ప్రత్యేక నిఘా
వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో వేస్తే చర్యలు తప్పవు.
నగరపాలిక: ఫుట్పాత్లు, రోడ్లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమించి మటన్, చేపల విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం అనుమతి, లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే మాంసం విక్రయాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా ఆదివారాల్లో ఫుట్పాత్లపై మటన్, చేపల విక్రయాలు జరగకుండా మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైన్లలో మాంస వ్యర్థాలను పడేయడం ద్వారా పారిశుధ్యం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై వ్యాపారం నిలిపివేయడంతో పాటు ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. అవసరమైతే దుకాణాలను సీజ్ చేసి, విక్రయ సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ మున్సిపల్ నిబంధనలు పాటించాలని కమిషనర్ బి.వంశీకృష్ణ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి