Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీవారి ఆలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 04:17 PM

ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలకు చెక్‌!

ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలకు చెక్‌!

ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలకు చెక్‌!
08-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. మున్సిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ హెచ్చరిక.


అనుమతి, లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లోనే మాంసం విక్రయాలు.


రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో విక్రయాలు నిషేధం.. ఆదివారాల్లో ప్రత్యేక నిఘా

వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో వేస్తే చర్యలు తప్పవు.


నగరపాలిక: ఫుట్‌పాత్‌లు, రోడ్లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమించి మటన్‌, చేపల విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం అనుమతి, లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో మాత్రమే మాంసం విక్రయాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా ఆదివారాల్లో ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలు జరగకుండా మున్సిపల్‌ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైన్లలో మాంస వ్యర్థాలను పడేయడం ద్వారా పారిశుధ్యం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై వ్యాపారం నిలిపివేయడంతో పాటు ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు. అవసరమైతే దుకాణాలను సీజ్‌ చేసి, విక్రయ సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ మున్సిపల్‌ నిబంధనలు పాటించాలని కమిషనర్‌ బి.వంశీకృష్ణ సూచించారు.


Sthanikam

ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలకు చెక్‌!

Article Image

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. మున్సిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ హెచ్చరిక.


అనుమతి, లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లోనే మాంసం విక్రయాలు.


రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో విక్రయాలు నిషేధం.. ఆదివారాల్లో ప్రత్యేక నిఘా

వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో వేస్తే చర్యలు తప్పవు.


నగరపాలిక: ఫుట్‌పాత్‌లు, రోడ్లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమించి మటన్‌, చేపల విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం అనుమతి, లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో మాత్రమే మాంసం విక్రయాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా ఆదివారాల్లో ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలు జరగకుండా మున్సిపల్‌ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైన్లలో మాంస వ్యర్థాలను పడేయడం ద్వారా పారిశుధ్యం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై వ్యాపారం నిలిపివేయడంతో పాటు ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు. అవసరమైతే దుకాణాలను సీజ్‌ చేసి, విక్రయ సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ మున్సిపల్‌ నిబంధనలు పాటించాలని కమిషనర్‌ బి.వంశీకృష్ణ సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News