భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించేందుకు తెలంగాణ పొలిటికల్ యువజన సమితి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శనివారం జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి తల్లి, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మను కలిసి కమిటీ తరఫున అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీకాంతాచారి త్యాగానికి గుర్తుగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై నాయకులు శంకరమ్మతో చర్చించారు. ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ యువజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంజమూరి రామన్న, రాష్ట్ర అధ్యక్షుడు సింగపాక నవీన్ బిల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్ కుమార్, కోఆర్డినేటర్ మహంకాళి సురేష్చారి, కార్యదర్శి నమోజు రాజుచారి, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పడిగం శ్రీను, చెన్నోజు నరహరిచారి, వెలిశాల బ్రహ్మచారి, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ సురుపంగ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి