Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నడిగూడెం లో పోలీస్ నాకాబందీ, వాహనాల తనిఖీ నిర్వహణ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 11:55 AM

శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటుకు కసరత్తు తల్లి శంకరమ్మకు తెలంగాణ పొలిటికల్ యువజన సమితి అభినందనలు

శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటుకు కసరత్తు తల్లి శంకరమ్మకు తెలంగాణ పొలిటికల్ యువజన సమితి అభినందనలు

శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటుకు కసరత్తు  తల్లి శంకరమ్మకు తెలంగాణ పొలిటికల్ యువజన సమితి అభినందనలు
08-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించేందుకు తెలంగాణ పొలిటికల్ యువజన సమితి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శనివారం జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి తల్లి, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మను కలిసి కమిటీ తరఫున అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీకాంతాచారి త్యాగానికి గుర్తుగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై నాయకులు శంకరమ్మతో చర్చించారు. ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ యువజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంజమూరి రామన్న, రాష్ట్ర అధ్యక్షుడు సింగపాక నవీన్ బిల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్ కుమార్, కోఆర్డినేటర్ మహంకాళి సురేష్‌చారి, కార్యదర్శి నమోజు రాజుచారి, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పడిగం శ్రీను, చెన్నోజు నరహరిచారి, వెలిశాల బ్రహ్మచారి, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సురుపంగ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటుకు కసరత్తు తల్లి శంకరమ్మకు తెలంగాణ పొలిటికల్ యువజన సమితి అభినందనలు

Article Image

భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించేందుకు తెలంగాణ పొలిటికల్ యువజన సమితి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శనివారం జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి తల్లి, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మను కలిసి కమిటీ తరఫున అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీకాంతాచారి త్యాగానికి గుర్తుగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై నాయకులు శంకరమ్మతో చర్చించారు. ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ యువజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంజమూరి రామన్న, రాష్ట్ర అధ్యక్షుడు సింగపాక నవీన్ బిల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్ కుమార్, కోఆర్డినేటర్ మహంకాళి సురేష్‌చారి, కార్యదర్శి నమోజు రాజుచారి, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పడిగం శ్రీను, చెన్నోజు నరహరిచారి, వెలిశాల బ్రహ్మచారి, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సురుపంగ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News