స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోదాడ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె. సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పనిభారంతో శారీరక, మానసిక అలసటకు గురయ్యే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. రోజువారీ జీవితంలో కనీసం ఒక గంట పాటు వ్యాయామం లేదా ఏదైనా ఒక క్రీడలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహరావు, జనరల్ సెక్రటరీ రామిశెట్టి రామకృష్ణ, జాని పాషా, కోడూరు వెంకటేశ్వర్లు, వెంకటాచలం, గాలి శ్రీనివాస్ నాయుడు, సీతారామరాజు, రంజాన్ పాషా, బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దబ్బాయి, సీనియర్ న్యాయవాదులు వై. సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, సాధు శరత్ బాబు, సిలివేరు వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, బి. గోవర్ధన్, ఈదుల కృష్ణయ్య, నర్సయ్య పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..........

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి