PRINT TIME: July 26, 2026 08:23 PM
దానధర్మానికి నిదర్శనం.. ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమి దానం
దానధర్మానికి నిదర్శనం.. ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమి దానం
July 26, 2026 06:23 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయానికి మాజీ సర్పంచ్ పట్లోళ్ల అమరేందర్ రెడ్డి సుమారు రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమిని దానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయన సేవాభావాన్ని అభినందించారు. ఆలయ కమిటీ సభ్యుడు సంగమేశ్వర చారి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ఇంత విలువైన భూమిని దానం చేయడం ఎంతో గొప్ప విషయమని, అమరేందర్ రెడ్డి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ నికిత బింభదర్ చారి మాట్లాడుతూ, సంపద కంటే దానధర్మం గొప్పదని, గ్రామానికి ఆదర్శంగా నిలిచే ఈ భూదానం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి