Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 08:23 PM

దానధర్మానికి నిదర్శనం.. ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమి దానం

దానధర్మానికి నిదర్శనం.. ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమి దానం

దానధర్మానికి నిదర్శనం.. ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమి దానం
July 26, 2026 06:23 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయానికి మాజీ సర్పంచ్ పట్లోళ్ల అమరేందర్ రెడ్డి సుమారు రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమిని దానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయన సేవాభావాన్ని అభినందించారు. ఆలయ కమిటీ సభ్యుడు సంగమేశ్వర చారి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ఇంత విలువైన భూమిని దానం చేయడం ఎంతో గొప్ప విషయమని, అమరేందర్ రెడ్డి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ నికిత బింభదర్ చారి మాట్లాడుతూ, సంపద కంటే దానధర్మం గొప్పదని, గ్రామానికి ఆదర్శంగా నిలిచే ఈ భూదానం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News