Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:26 PM

యోగి గణేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా చెస్ టోర్నమెంట్

యోగి గణేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా చెస్ టోర్నమెంట్

యోగి గణేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా చెస్ టోర్నమెంట్
20-09-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కంగ్టి గ్రామంలో యోగి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చెస్ టోర్నమెంట్ సీజన్-2’ ఘనంగా ముగిసింది. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చెస్ పోటీలను నిర్వహించడం పట్ల గ్రామస్థులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఎర్లగడ్డ సాయి కిరణ్ మొదటి బహుమతి, నిహారిక చల్ల రెండో బహుమతి, హేమంత్ మూడో బహుమతి సాధించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. యువతలో ఆలోచనా శక్తి, ప్రతిభను వెలికితీసేలా నవరాత్రి ఉత్సవాల్లో చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యోగి గణేష్ అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులను కంగ్టి గ్రామస్థులు అభినందించారు.

Sthanikam

యోగి గణేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా చెస్ టోర్నమెంట్

Article Image

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కంగ్టి గ్రామంలో యోగి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చెస్ టోర్నమెంట్ సీజన్-2’ ఘనంగా ముగిసింది. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చెస్ పోటీలను నిర్వహించడం పట్ల గ్రామస్థులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఎర్లగడ్డ సాయి కిరణ్ మొదటి బహుమతి, నిహారిక చల్ల రెండో బహుమతి, హేమంత్ మూడో బహుమతి సాధించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. యువతలో ఆలోచనా శక్తి, ప్రతిభను వెలికితీసేలా నవరాత్రి ఉత్సవాల్లో చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యోగి గణేష్ అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులను కంగ్టి గ్రామస్థులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News