కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు “రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా” పేరుతో పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్రలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మీదుగా వెళ్తున్న కాటూరి వెంకటేశ్వర్లును మాజీ మండల అధ్యక్షుడు మాణిక్ రావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు కాటూరి వెంకటేశ్వర్లు తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే సందేశంతో యాత్ర కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి, రాజేష్ రెడ్డి, ఎకనాథ్, దత్తు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటూ పాదయాత్ర
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటూ పాదయాత్ర
Krishna
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు “రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా” పేరుతో పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్రలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మీదుగా వెళ్తున్న కాటూరి వెంకటేశ్వర్లును మాజీ మండల అధ్యక్షుడు మాణిక్ రావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు కాటూరి వెంకటేశ్వర్లు తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే సందేశంతో యాత్ర కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి, రాజేష్ రెడ్డి, ఎకనాథ్, దత్తు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి