ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్పర్సన్
భువనగిరి, సెప్టెంబర్ 20: బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి స్మార్ట్) యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ప్రెసిడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్పర్సన్ తీగల జయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇటీవల నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బి స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. పగిడాల జలంధర్ రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి బి స్మార్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులతో పాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు.
జయలక్ష్మి ఎన్నిక పట్ల పలువురు బి స్మార్ట్ నాయకులు, పాఠశాలల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి