నల్లగొండ: కనగల్ మండలంలోని తిమ్మన్నగూడెం, తెలకంటిగూడెం గ్రామాల్లో నీరు లేక, విద్యుత్ కోతల కారణంగా ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదివారం పరిశీలించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి