భార్య మృతి, ఆర్థిక ఇబ్బందులే కారణం
భార్య దూరమవ్వడం, ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తంగడపల్లికి చెందిన బుంగపట్ల మహేష్ (33, ముదిరాజ్) వృత్తిరీత్యా డ్రైవర్. అతడి భార్య స్వప్న 16 నెలల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కాగా, తల్లి మరణానంతరం ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నారు.ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహేష్.. భార్యాపిల్లలు దూరమయ్యారనే బాధతోపాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11:20 గంటల సమయంలో తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు విడిచాడు. మృతుడి సోదరుడు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి