Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష.. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 07:57 PM

వినాయక మండపాల వద్ద నిబంధనలు పాటించాలి: నాగోల్‌ సీఐ మక్బూల్‌ జానీ

వినాయక మండపాల వద్ద నిబంధనలు పాటించాలి: నాగోల్‌ సీఐ మక్బూల్‌ జానీ

వినాయక మండపాల వద్ద నిబంధనలు పాటించాలి: నాగోల్‌ సీఐ మక్బూల్‌ జానీ
18-09-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం

నాగోల్‌: వినాయక ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాగోల్‌ సీఐ మహమ్మద్‌ మక్బూల్‌ జానీ సూచించారు. బండ్లగూడలోని రాజీవ్‌ సహాభావన అపార్ట్‌మెంట్స్‌, తట్టి అన్నారంలోని అన్నవరపు సత్యనారాయణ కాలనీలో వినాయక మండపాల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.

వాహనదారులు హెల్మెట్‌, సీటుబెల్ట్‌ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్‌, అతివేగం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం చేయవద్దన్నారు. మండపాల వద్ద వాహనాలను రోడ్డుపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరగడమే పోలీసుల లక్ష్యం. ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీఐ మక్బూల్‌ జానీ కోరారు.

కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లారెడ్డి, హెచ్‌సీలు నర్సింహ, దశరథ, ఎస్సై సూర్య, ఎస్‌జీహెచ్‌ సహచారి లక్ష్మీకవిత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వినాయక మండపాల వద్ద నిబంధనలు పాటించాలి: నాగోల్‌ సీఐ మక్బూల్‌ జానీ

Article Image

ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం

నాగోల్‌: వినాయక ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాగోల్‌ సీఐ మహమ్మద్‌ మక్బూల్‌ జానీ సూచించారు. బండ్లగూడలోని రాజీవ్‌ సహాభావన అపార్ట్‌మెంట్స్‌, తట్టి అన్నారంలోని అన్నవరపు సత్యనారాయణ కాలనీలో వినాయక మండపాల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.

వాహనదారులు హెల్మెట్‌, సీటుబెల్ట్‌ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్‌, అతివేగం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం చేయవద్దన్నారు. మండపాల వద్ద వాహనాలను రోడ్డుపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరగడమే పోలీసుల లక్ష్యం. ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీఐ మక్బూల్‌ జానీ కోరారు.

కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లారెడ్డి, హెచ్‌సీలు నర్సింహ, దశరథ, ఎస్సై సూర్య, ఎస్‌జీహెచ్‌ సహచారి లక్ష్మీకవిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News