బాలికల కళాశాల సైన్స్ ల్యాబ్కు మరమ్మతులు..
మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో కలెక్టర్ పరిశీలన..
నల్గొండ : స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని సైన్స్ ల్యాబ్కు త్వరలోనే మరమ్మతులు చేపడతామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. గురువారం జరిగిన 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' వేడుకల్లో భాగంగా కళాశాల విద్యార్థినులు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలసి తమ సమస్యను విన్నవించారు. ల్యాబ్ భవనం పాతబడి పెచ్చులు ఊడిపోతుండటంతో ప్రమాదకరంగా మారిందని, కొత్తది మంజూరు చేయాలని కోరారు.
విద్యార్థినుల వినతిపై తక్షణమే స్పందించిన మంత్రి... ల్యాబ్ను పరిశీలించి మరమ్మతులు చేపటాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ కళాశాలను సందర్శించారు. ల్యాబ్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... మంత్రి ఆదేశాల మేరకు ల్యాబ్కు అవసరమైన మరమ్మతులు పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్, కళాశాల ప్రిన్సిపల్ పద్మ తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి