యాదాద్రి కలెక్టరేట్, సెప్టెంబర్ 18:
బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి స్మార్ట్) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ సభ్యులు జిల్లా విద్యాధికారి బిక్షపతిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బి స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు డీఈఓను శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు.
నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కొండూరి మల్లేశం గౌడ్, కోశాధికారి సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు తీగల జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆబోతుల కీర్తి డీఈఓను కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండూరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ తరఫున సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విషయంలో అధికారులతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో బి స్మార్ట్ బీబీనగర్ మండల అధ్యక్షులు కోణార్కరావు, కాశీ విశ్వనాథ్, మంజు బాబా తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి