దివీస్ ల్యాబోరేటరీస్లో 'మహిళా భద్రత'పై అవగాహన సదస్సు
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తుందని, ఆపద సమయంలో భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని చౌటుప్పల్ సీఐ జి.మన్మథ కుమార్ సూచించారు. మండలంలోని అంకిరెడ్డిగూడెంలో ఉన్న దివీస్ ల్యాబోరేటరీస్ కంపెనీ ప్రాంగణంలో గురువారం మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు (Women Safety Awareness Program) నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు అందుబాటులో ఉండే రక్షణ, సహాయ సేవలు, సాంకేతిక యాప్ల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించారు. పనిప్రాంతాల్లో లేదా ప్రయాణాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెనుకాడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి