జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాం విముక్తి పోరాటంలో, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయ సాధనకు అనుగుణంగా ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో 'ప్రజా పాలన' ద్వారా ప్రజలకు పారదర్శకమైన, ఆమోదయోగ్యమైన సంక్షేమ పాలనను అందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ, ప్రజా పాలన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పొలెపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కొయ్యడ శేఖర్, ఆలె శ్రీలత చిరంజీవి, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, ఉడుగు జ్యోతి రమేష్, బత్తుల జయమ్మ దాసు, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూధన్, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగరాములు, మహమ్మద్ బాబాషరీఫ్, షేక్ నబీబి జానీ బాబా, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి