కంగ్టి మండల కేంద్రంలో గురువారం రాధా క్లినిక్ ఆధ్వర్యంలో డాక్టర్ నెహ్రూ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు ఎముకల ఖనిజ సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ అనంతరం ఎముకలు బలహీనపడే సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. కంగ్టి మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరయ్యారు. మోకాళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న సుమారు 180 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన చికిత్స, జాగ్రత్తలపై వైద్యులు సూచనలు అందించారు. ఉచితంగా వైద్య సేవలు అందించిన రాధా క్లినిక్ నిర్వాహకులను స్థానికులు అభినందించారు.
PRINT TIME: September 17, 2026 08:10 PM
కంగ్టిలో ఉచిత వైద్య శిబిరం.. 180 మందికి వైద్య పరీక్షలు
కంగ్టిలో ఉచిత వైద్య శిబిరం.. 180 మందికి వైద్య పరీక్షలు
17-09-2026
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
కంగ్టి మండల కేంద్రంలో గురువారం రాధా క్లినిక్ ఆధ్వర్యంలో డాక్టర్ నెహ్రూ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు ఎముకల ఖనిజ సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ అనంతరం ఎముకలు బలహీనపడే సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. కంగ్టి మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరయ్యారు. మోకాళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న సుమారు 180 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన చికిత్స, జాగ్రత్తలపై వైద్యులు సూచనలు అందించారు. ఉచితంగా వైద్య సేవలు అందించిన రాధా క్లినిక్ నిర్వాహకులను స్థానికులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి