బీబీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గురువారం ‘సేవాహీ సంకల్ప దీపం అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్యగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆవరణలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో జీవించాలని, దేశ సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్, మండల అధ్యక్షుడు సదానందం, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రామచంద్రతో పాటు ప్రభాకర్, నరేష్ నాయక్, వంశీ, ప్రదీప్, రేణుక తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి