Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 09:40 PM

27 ఏళ్లుగా ఆజాద్ యూత్ గణేష్ వేడుకలు

27 ఏళ్లుగా ఆజాద్ యూత్ గణేష్ వేడుకలు

27 ఏళ్లుగా ఆజాద్ యూత్ గణేష్ వేడుకలు
17-09-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్నారుల చేతుల మీదుగా గణనాథునికి ప్రత్యేక పూజలు

మండలంలోని చిన్నకొండూరు గ్రామం బాపూజీ కాలనీలో ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 27 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్నారుల చేతుల మీదుగా గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా చేపట్టారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ​ఈ సందర్భంగా యూత్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉత్సవాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను వారికి అందిస్తున్నామని తెలిపారు. పాతికేళ్లకు పైగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు, యువత సహకారంతో ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గణనాథుని ఆశీస్సులతో గ్రామంలో అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ యూత్ అసోసియేషన్ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

27 ఏళ్లుగా ఆజాద్ యూత్ గణేష్ వేడుకలు

Article Image

చిన్నారుల చేతుల మీదుగా గణనాథునికి ప్రత్యేక పూజలు

మండలంలోని చిన్నకొండూరు గ్రామం బాపూజీ కాలనీలో ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 27 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్నారుల చేతుల మీదుగా గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా చేపట్టారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ​ఈ సందర్భంగా యూత్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉత్సవాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను వారికి అందిస్తున్నామని తెలిపారు. పాతికేళ్లకు పైగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు, యువత సహకారంతో ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గణనాథుని ఆశీస్సులతో గ్రామంలో అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ యూత్ అసోసియేషన్ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News