హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల నిర్వహణకు ప్రముఖ సామాజిక సేవా తత్పరులు, భీష్మరాజ్ ఫౌండేషన్ డాక్టర్ కే. రాజ్కుమార్రెడ్డి రూ.69 వేల విరాళాన్ని అందజేశారు. గురువారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న ఆయన.. ఉత్సవ సమితి ప్రతినిధులకు రూ.69,000 నగదును అందించారు.
ఈ సందర్భంగా రాజ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణేశ్ ఉత్సవాల్లో తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలు సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ఉత్సవ సమితి సభ్యులు డాక్టర్ రాజ్కుమార్రెడ్డిని శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి