ప్రజల మన్ననలు పొందాలి
నాగోల్: పోలీసు అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాగోల్ పోలీస్స్టేషన్ సీఐ మక్బుల్ జానీ సూచించారు . నాగోల్ పోలీస్స్టేషన్లో ఎస్ఐలుగా విధులు నిర్వహించి చైతన్యపురి పోలీస్స్టేషన్కు బదిలీ అయిన పి.శివనాగ ప్రసాద్, బి.రమేష్లకు గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సీఐ మక్బుల్ జానీ మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సుమారు రెండేళ్ల నాలుగు నెలలపాటు నాగోల్లో విధులు నిర్వహించిన శివనాగ ప్రసాద్, రమేష్లు నిబద్ధతతో పనిచేశారని అభినందించారు. పలు కేసుల దర్యాప్తులో చొరవ చూపడంతోపాటు ప్రజలకు భద్రత కల్పించడంలో సేవలందించారని పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లోనూ సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
బదిలీ అయిన ఎస్ఐలు మాట్లాడుతూ.. నాగోల్లో విధులు నిర్వహించిన సమయంలో సహకరించిన పోలీసు సిబ్బంది, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారం, సిబ్బంది సమన్వయంతో విధులను సమర్థవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు.
అనంతరం పోలీసు సిబ్బంది, స్థానిక నాయకులు శివనాగ ప్రసాద్, రమేష్లను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు చెరుకు చిరంజీవి గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, బీఆర్ఎస్ నాయకులు అనంతుల జంగారెడ్డి, సతీష్ యాదవ్, బీజేపీ నాయకులు చింతల సురేంద్ర యాదవ్, నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు చెరుకు ప్రవీణ్కుమార్తో పాటు పలువురు నాయకులు, పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి