Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 09:17 PM

మానూర్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

మానూర్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

మానూర్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
17-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలు సక్రమంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పారదర్శకంగా, సులభంగా సేవలు అందించడమే ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఐ శంకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్, రఘురాములు, నర్సింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానూర్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలు సక్రమంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పారదర్శకంగా, సులభంగా సేవలు అందించడమే ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఐ శంకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్, రఘురాములు, నర్సింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News