చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నాలు తొలగి సర్వత్రా శుభాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి