Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జగ్గన్నపై చెరగని అభిమానం.. టాటూలతో అభిమానుల సందడి 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 05:08 PM

కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
14-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రవ్యాప్తంగా 5,000 మట్టి విగ్రహాల ఉచిత వితరణ: కస్తూరి ఫౌండేషన్

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు భద్రత

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సంస్థాన్ నారాయణపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 5,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుండగా, స్థానికంగా ఫౌండేషన్ సభ్యుడు వీరమల్ల కార్తీక్ గౌడ్ పర్యవేక్షణలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విగ్రహాలను ఉత్సాహంగా స్వీకరించారు.​ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా నిరంతరాయంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో పర్యావరణ చైతన్యం నింపుతున్నారని కొనియాడారు. "మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే గొప్ప సందేశంతో సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని, భక్తితో పాటు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రతినిధులు మందుగుల బాలకృష్ణ, పాలకుర్ల యాదయ్య, తెలంగాణ బిక్షం, ఎలిజాల శీను, సిలివేరు సైదులు, బద్దం యాదయ్య, కొండ శ్రీకాంత్, దూసరి వెంకటేశం, బైక్ కానీ నరేందర్, రామకృష్ణ, వేణు, రాజు, వీడం సాయి, ప్రభాకర్, సునీల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Article Image

రాష్ట్రవ్యాప్తంగా 5,000 మట్టి విగ్రహాల ఉచిత వితరణ: కస్తూరి ఫౌండేషన్

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు భద్రత

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సంస్థాన్ నారాయణపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 5,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుండగా, స్థానికంగా ఫౌండేషన్ సభ్యుడు వీరమల్ల కార్తీక్ గౌడ్ పర్యవేక్షణలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విగ్రహాలను ఉత్సాహంగా స్వీకరించారు.​ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా నిరంతరాయంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో పర్యావరణ చైతన్యం నింపుతున్నారని కొనియాడారు. "మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే గొప్ప సందేశంతో సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని, భక్తితో పాటు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రతినిధులు మందుగుల బాలకృష్ణ, పాలకుర్ల యాదయ్య, తెలంగాణ బిక్షం, ఎలిజాల శీను, సిలివేరు సైదులు, బద్దం యాదయ్య, కొండ శ్రీకాంత్, దూసరి వెంకటేశం, బైక్ కానీ నరేందర్, రామకృష్ణ, వేణు, రాజు, వీడం సాయి, ప్రభాకర్, సునీల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News