Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జగ్గన్నపై చెరగని అభిమానం.. టాటూలతో అభిమానుల సందడి 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 05:08 PM

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.
14-09-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భక్తిశ్రద్ధలతో.. సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్.


నల్లగొండ: వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్‌ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్సవాలను పరస్పర గౌరవం, సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పండుగను ఆనందంగా జరుపుకుంటూనే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బీ సీఐ నాగరాజు, ఆర్‌ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, కళ్యాణ్ రాజ్, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Sthanikam

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.

Article Image

భక్తిశ్రద్ధలతో.. సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్.


నల్లగొండ: వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్‌ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్సవాలను పరస్పర గౌరవం, సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పండుగను ఆనందంగా జరుపుకుంటూనే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బీ సీఐ నాగరాజు, ఆర్‌ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, కళ్యాణ్ రాజ్, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News