Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 09:24 PM

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి
13-09-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలోతో పాటు తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రజలకు గుర్తుచేసేలా ప్రతి ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ సాధన గురించి మాట్లాడే ఇతర నాయకులను ఆయన విమర్శించారు. సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్పతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలోతో పాటు తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రజలకు గుర్తుచేసేలా ప్రతి ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ సాధన గురించి మాట్లాడే ఇతర నాయకులను ఆయన విమర్శించారు. సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్పతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News