Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ ఉత్సవాలకు సన్నద్ధం.. నగర సమితి కార్యాలయం ప్రారంభం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 01:10 PM

చట్టం నుంచి తప్పించుకోలేరు

చట్టం నుంచి తప్పించుకోలేరు

చట్టం నుంచి తప్పించుకోలేరు
13-09-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.


బీబీనగర్: ఎన్నేళ్లు గడిచినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని తాజా పరిణామం మరోసారి స్పష్టం చేసింది. బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 339లో దళితులకు కేటాయించిన భూమికి సంబంధించి వివాదం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులతో పాటు మొత్తం 14 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం.

ఇందిరాగాంధీ హయాంలో దళితులకు కేటాయించిన భూమిలో ఒక కుటుంబానికి సంబంధించిన ఎకరం భూమిని 2018–19లో అప్పటి బీబీనగర్ ఎంఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, (ప్రస్తుతం నల్గొండ Rdo .)సర్వేయర్ రజినీకాంత్,( ప్రస్తుతం చిట్యాల) Ri రజినేష్ .( ప్రస్తుతం భువనగిరి) తదితరులు కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా డీమార్కేషన్‌, పంచనామా నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. భూమి సర్వే సమయంలో సంబంధిత దళిత కుటుంబానికి నోటీసులు ఇవ్వకుండా, అధికారిక ప్రక్రియను పాటించకుండా ఎంఓయూలు చేయించి భూమిని స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న భూమి వారసుడు, యువ న్యాయవాది జేరిపోతుల నగేష్‌ సంబంధిత భూ పత్రాలను సేకరించి అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోయిందని తెలిపారు. బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా, భూమిపై ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ తనతో పాటు తన అన్నపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.దీంతో న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నగేష్‌ నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రైవేట్‌ కంప్లైంట్‌ దాఖలు చేశారు. సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

తనపై కేసు నమోదు చేసిన స్టేషన్‌లోనే అధికారులపై ఎఫ్‌ఐఆర్‌

విధి నిర్వహణలో భాగంగా పనిచేసిన పోలీస్‌స్టేషన్‌లోనే సంబంధిత అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా మారింది. నలుగురు ప్రభుత్వ అధికారులతో సహా మొత్తం 14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్లు సమాచారం. కేసును తన సమస్యగా భావించిన పత్తి నరేష్‌ తదితర మిత్రులు నగేష్‌కు అండగా నిలిచారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.


Sthanikam

చట్టం నుంచి తప్పించుకోలేరు

Article Image

14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.


బీబీనగర్: ఎన్నేళ్లు గడిచినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని తాజా పరిణామం మరోసారి స్పష్టం చేసింది. బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 339లో దళితులకు కేటాయించిన భూమికి సంబంధించి వివాదం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులతో పాటు మొత్తం 14 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం.

ఇందిరాగాంధీ హయాంలో దళితులకు కేటాయించిన భూమిలో ఒక కుటుంబానికి సంబంధించిన ఎకరం భూమిని 2018–19లో అప్పటి బీబీనగర్ ఎంఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, (ప్రస్తుతం నల్గొండ Rdo .)సర్వేయర్ రజినీకాంత్,( ప్రస్తుతం చిట్యాల) Ri రజినేష్ .( ప్రస్తుతం భువనగిరి) తదితరులు కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా డీమార్కేషన్‌, పంచనామా నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. భూమి సర్వే సమయంలో సంబంధిత దళిత కుటుంబానికి నోటీసులు ఇవ్వకుండా, అధికారిక ప్రక్రియను పాటించకుండా ఎంఓయూలు చేయించి భూమిని స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న భూమి వారసుడు, యువ న్యాయవాది జేరిపోతుల నగేష్‌ సంబంధిత భూ పత్రాలను సేకరించి అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోయిందని తెలిపారు. బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా, భూమిపై ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ తనతో పాటు తన అన్నపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.దీంతో న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నగేష్‌ నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రైవేట్‌ కంప్లైంట్‌ దాఖలు చేశారు. సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

తనపై కేసు నమోదు చేసిన స్టేషన్‌లోనే అధికారులపై ఎఫ్‌ఐఆర్‌

విధి నిర్వహణలో భాగంగా పనిచేసిన పోలీస్‌స్టేషన్‌లోనే సంబంధిత అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా మారింది. నలుగురు ప్రభుత్వ అధికారులతో సహా మొత్తం 14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్లు సమాచారం. కేసును తన సమస్యగా భావించిన పత్తి నరేష్‌ తదితర మిత్రులు నగేష్‌కు అండగా నిలిచారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News