భువనగిరి పట్టణ పరిధిలోని 11వ వార్డు బొమ్మాయిపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ కింద వర్షపు నీరు నిలవకుండా వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి అండర్ పాస్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న అండర్ పాస్ కింద వర్షపు నీటితో పాటు పొలాల నుంచి వచ్చే నీరు చేరి కింది భాగం లోతుగా మారడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, పశువులు కూడా వెళ్లే పరిస్థితి లేదని పేర్కొన్నారు. గతంలో పాత బ్రిడ్జి పక్క నుంచి ఉన్న నీటి కాలువను పునరుద్ధరించి, వర్షపు నీరు సఫీగా పోయేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, సైడ్ గోడను తొలగించడంతో రైల్వే కట్ట మట్టి అంతా రోడ్డుపైకి కొట్టుకొచ్చి అండర్ పాస్ లోకి చేరుతోందని, వెంటనే రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) నిర్మించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీక్రెట్ సభ్యులు గంధమల్ల మాతయ్య, పర్వత్ బాలకృష్ణ, శాఖ కార్యదర్శి బండి రవి, బండి వెంకటేశం, గుండెబోయిన కృష్ణ, పర్వత్ ఎట్టయ్య, గాడిద నరసింహ, బండి మల్లేష్, చిలుకూరి మల్లారెడ్డి, కడారి మహేష్, పర్వత్ సురేష్, కడారి ఐలయ్య, దొడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి