తాతయ్యలు, అమ్మమ్మల ఆశీస్సులు తీసుకున్న విద్యార్థులు
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: కరస్పాండెంట్ చైతన్యక్రాంతి వర్ధన్ రెడ్డి
స్థానిక విశాల భారతి హైస్కూల్ ఆవరణలో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలకు భక్తిశ్రద్ధలతో పాదపూజలు చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. పెద్దల ఆశీర్వచనాలు పొందడం పిల్లలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్యక్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... పిల్లలకు చిన్ననాటి నుంచే నైతిక విలువలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు నేర్పించడంలో తాతముత్తాతల పాత్ర కీలకమైనదన్నారు. నేటి ఆధునిక కాలంలో పాఠశాల ప్రాంగణంలో ఇలాంటి సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో తాతయ్యలు, అమ్మమ్మలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి