నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం హిమబిందు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసులను కక్షిదారుల పరస్పర అంగీకారంతో రాజీమార్గంలో పరిష్కరించారు. మొత్తం 574 కేసులు రాజీ ద్వారా పరిష్కారమైనట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు రావాలని, సమయం, ఖర్చు ఆదా చేసుకుని త్వరితగతిన న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని పేర్కొన్నారు. ప్రజలకు సులభంగా, త్వరగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్లో లోక్ అదాలత్లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం
నారాయణఖేడ్లో లోక్ అదాలత్లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం హిమబిందు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసులను కక్షిదారుల పరస్పర అంగీకారంతో రాజీమార్గంలో పరిష్కరించారు. మొత్తం 574 కేసులు రాజీ ద్వారా పరిష్కారమైనట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు రావాలని, సమయం, ఖర్చు ఆదా చేసుకుని త్వరితగతిన న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని పేర్కొన్నారు. ప్రజలకు సులభంగా, త్వరగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి