Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 07:53 PM

ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. జీకే అన్నారంలో సీపీఎం ఆధ్వర్యంలో నివాళి.

ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. జీకే అన్నారంలో సీపీఎం ఆధ్వర్యంలో నివాళి.

ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. జీకే అన్నారంలో సీపీఎం ఆధ్వర్యంలో నివాళి.
12-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ మండలం జీకే అన్నారం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం సభ్యురాలు కొండ అనురాధ మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం ఏచూరి జీవితాంతం పోరాడారని తెలిపారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్యతను నిర్మించడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడమే ఏచూరికి నిజమైన నివాళి అని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కొండా వెంకన్న, నల్పరాజు మధు, భాగ్యము, కొండ రాములు, సిద్ధు, రామ్, లక్ష్మణ్, వరుణ్, లాదర్, వర్మ, లక్ష్మమ్మ, పార్వతమ్మ, మనీ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. జీకే అన్నారంలో సీపీఎం ఆధ్వర్యంలో నివాళి.

Article Image

నల్గొండ: సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ మండలం జీకే అన్నారం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం సభ్యురాలు కొండ అనురాధ మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం ఏచూరి జీవితాంతం పోరాడారని తెలిపారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్యతను నిర్మించడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడమే ఏచూరికి నిజమైన నివాళి అని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కొండా వెంకన్న, నల్పరాజు మధు, భాగ్యము, కొండ రాములు, సిద్ధు, రామ్, లక్ష్మణ్, వరుణ్, లాదర్, వర్మ, లక్ష్మమ్మ, పార్వతమ్మ, మనీ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News