Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 11:09 AM

ఐటీపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఐటీపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఐటీపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
12-09-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన్న కారు.. తాత, మనవడికి తీవ్ర గాయాలు.


కట్టంగూరు: ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో తాత, మనవడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీపాముల వద్ద చోటుచేసుకుంది.

మియాపూర్‌కు చెందిన విశ్వేశ్వరరావు (50), జైకర్ (25) నందిగామ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా.. ఐటీపాముల వద్ద ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వారి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరూ అందులోనే చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న కట్టంగూరు పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి కారులో చిక్కుకున్న ఇద్దరినీ బయటకు తీశారు. 108 అంబులెన్స్ పైలట్ మహేష్, ఈఎంటీ శ్రీనివాస్ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ తాత, మనవడిగా గుర్తించారు. ఘటనపై కట్టంగూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Sthanikam

ఐటీపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Article Image

గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన్న కారు.. తాత, మనవడికి తీవ్ర గాయాలు.


కట్టంగూరు: ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో తాత, మనవడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీపాముల వద్ద చోటుచేసుకుంది.

మియాపూర్‌కు చెందిన విశ్వేశ్వరరావు (50), జైకర్ (25) నందిగామ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా.. ఐటీపాముల వద్ద ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వారి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరూ అందులోనే చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న కట్టంగూరు పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి కారులో చిక్కుకున్న ఇద్దరినీ బయటకు తీశారు. 108 అంబులెన్స్ పైలట్ మహేష్, ఈఎంటీ శ్రీనివాస్ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ తాత, మనవడిగా గుర్తించారు. ఘటనపై కట్టంగూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News