సెప్టెంబర్ 4న ఉట్ల పండుగ.. 6న గ్రామదేవతలకు ఊరందరి బోనాలు.
చిట్యాల, ఆగస్టు 29: చిట్యాల పురపాలక సంఘం పరిధిలో శ్రీ కృష్ణాష్టమి, బోనాల పండుగలను ఘనంగా నిర్వహించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు శనివారం చిట్యాల పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన, దౌలతాబాద్ వాసు దేవ శర్మ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి (ఉట్ల పండుగ)ను నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం గ్రామదేవతలకు ఊరందరి బోనాలు సమర్పించేందుకు తేదీని ఖరారు చేశారు.
పట్టణ ప్రజలందరూ కృష్ణాష్టమి, బోనాల పండుగలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించుకోవాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు, పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి