Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 12:35 PM

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం
29-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల, ఆగస్టు 29:

‘సే నో టు డ్రగ్స్‌ – సే నో టు గంజాయి’ నినాదంతో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌ వరకు పాదయాత్ర చేపడుతున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇమ్రాన్‌ ప్రిన్స్‌, ఆయన బృందాన్ని డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందించింది. శనివారం చిట్యాల మండలం వేలిమినేడు గ్రామం సమీపంలోని జాతీయ రహదారి వద్ద పాదయాత్ర బృందాన్ని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా మల్లం మహేష్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులు కాకుండా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడలు, విద్య, ఉపాధి, సామాజిక కార్యక్రమాల వైపు నడిపించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే సైకిల్‌ యాత్రలు, అవగాహన సదస్సులు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. యువత ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిచేలా మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

అదేవిధంగా గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌’ సినిమాను అభినందించారు. సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ యువతకు సందేశం ఇచ్చే సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి కూనూరు గణేష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు మేడి మనోజ్‌, కూరాకుల శివశంకర్‌, నాయకులు నూతనకంటి లింగస్వామి, దండు వివేక్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం

Article Image

చిట్యాల, ఆగస్టు 29:

‘సే నో టు డ్రగ్స్‌ – సే నో టు గంజాయి’ నినాదంతో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌ వరకు పాదయాత్ర చేపడుతున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇమ్రాన్‌ ప్రిన్స్‌, ఆయన బృందాన్ని డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందించింది. శనివారం చిట్యాల మండలం వేలిమినేడు గ్రామం సమీపంలోని జాతీయ రహదారి వద్ద పాదయాత్ర బృందాన్ని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా మల్లం మహేష్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులు కాకుండా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడలు, విద్య, ఉపాధి, సామాజిక కార్యక్రమాల వైపు నడిపించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే సైకిల్‌ యాత్రలు, అవగాహన సదస్సులు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. యువత ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిచేలా మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

అదేవిధంగా గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌’ సినిమాను అభినందించారు. సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ యువతకు సందేశం ఇచ్చే సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి కూనూరు గణేష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు మేడి మనోజ్‌, కూరాకుల శివశంకర్‌, నాయకులు నూతనకంటి లింగస్వామి, దండు వివేక్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News