Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:48 PM

గంజాయి ముఠా అరెస్ట్.. బైక్ దొంగతనాల గుట్టురట్టు.

గంజాయి ముఠా అరెస్ట్.. బైక్ దొంగతనాల గుట్టురట్టు.

గంజాయి ముఠా అరెస్ట్.. బైక్ దొంగతనాల గుట్టురట్టు.
28-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: పట్టణంలో గంజాయి విక్రయిస్తూ, మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నల్లగొండ II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి, నాలుగు మోటార్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఒడిశా రాష్ట్రంలోని పసుపులంక ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి నల్లగొండలో చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గంజాయి కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో దొంగిలించిన బైక్‌ను కుదువ పెట్టి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నల్లగొండతో పాటు హైదరాబాద్‌లో పలువురు వాహనాలను దొంగిలించినట్లు గుర్తించారు.

ఈ కేసును డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ కె. ఆది రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు డి. సైద బాబు, అహ్మద్ షరీఫ్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Sthanikam

గంజాయి ముఠా అరెస్ట్.. బైక్ దొంగతనాల గుట్టురట్టు.

Article Image

నల్లగొండ: పట్టణంలో గంజాయి విక్రయిస్తూ, మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నల్లగొండ II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి, నాలుగు మోటార్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఒడిశా రాష్ట్రంలోని పసుపులంక ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి నల్లగొండలో చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గంజాయి కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో దొంగిలించిన బైక్‌ను కుదువ పెట్టి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నల్లగొండతో పాటు హైదరాబాద్‌లో పలువురు వాహనాలను దొంగిలించినట్లు గుర్తించారు.

ఈ కేసును డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ కె. ఆది రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు డి. సైద బాబు, అహ్మద్ షరీఫ్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News