చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా తొలగింపు
లక్షల విలువైన ప్రజా ఆస్తిపై ఆరోపణలు.. వివరాలు సేకరించిన విలేకరికి బెదిరింపులు
ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం "చెట్లు నాటండి.. పచ్చదనాన్ని పెంచండి" అని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తుండటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పంచాయతీ తీర్మానం ఉందనే పేరుతో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే రూ.లక్షల విలువైన చెట్లను తొలగించి ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు గ్రామస్తులు, పశుపోషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నరికిన కలపను ఎక్కడికి తరలించారు? ఎంత విలువైన ఆస్తి చేతులు మారింది? అనే అంశాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పంచనామా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించిన విలేకరికి ఫోన్లో బెదిరింపులు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మిగిలి ఉన్న చెట్లనైనా రక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి