Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:52 PM

చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం!

చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం!

చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం!
28-08-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా తొలగింపు

లక్షల విలువైన ప్రజా ఆస్తిపై ఆరోపణలు.. వివరాలు సేకరించిన విలేకరికి బెదిరింపులు

ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం "చెట్లు నాటండి.. పచ్చదనాన్ని పెంచండి" అని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తుండటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పంచాయతీ తీర్మానం ఉందనే పేరుతో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే రూ.లక్షల విలువైన చెట్లను తొలగించి ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు గ్రామస్తులు, పశుపోషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నరికిన కలపను ఎక్కడికి తరలించారు? ఎంత విలువైన ఆస్తి చేతులు మారింది? అనే అంశాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పంచనామా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించిన విలేకరికి ఫోన్‌లో బెదిరింపులు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మిగిలి ఉన్న చెట్లనైనా రక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం!

Article Image

చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా తొలగింపు

లక్షల విలువైన ప్రజా ఆస్తిపై ఆరోపణలు.. వివరాలు సేకరించిన విలేకరికి బెదిరింపులు

ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం "చెట్లు నాటండి.. పచ్చదనాన్ని పెంచండి" అని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు దేపోని చెరువు పరిధిలో విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తుండటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పంచాయతీ తీర్మానం ఉందనే పేరుతో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే రూ.లక్షల విలువైన చెట్లను తొలగించి ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు గ్రామస్తులు, పశుపోషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నరికిన కలపను ఎక్కడికి తరలించారు? ఎంత విలువైన ఆస్తి చేతులు మారింది? అనే అంశాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పంచనామా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించిన విలేకరికి ఫోన్‌లో బెదిరింపులు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మిగిలి ఉన్న చెట్లనైనా రక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News