Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:33 AM

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి
28-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పాఠశాలలో పోక్సో, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై అవగాహన

విద్యార్థులు సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల సంస్కృతికి ఆకర్షితులు కాకుండా చదువుపైనే దృష్టి సారించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి సూచించారు.

​మండలంలోని తంగడపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం డీసీపీయూ, జస్ట్ రైట్స్ చిల్డ్రన్ & స్కోప్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై పోక్సో కింద తీవ్ర శిక్షలు ఉంటాయని తెలిపారు. ఆపద సమయాల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా 112 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.

​అనంతరం టోల్ ఫ్రీ నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించి, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు డి. భార్గవి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బి. నరసింహరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి

Article Image

పాఠశాలలో పోక్సో, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై అవగాహన

విద్యార్థులు సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల సంస్కృతికి ఆకర్షితులు కాకుండా చదువుపైనే దృష్టి సారించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి సూచించారు.

​మండలంలోని తంగడపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం డీసీపీయూ, జస్ట్ రైట్స్ చిల్డ్రన్ & స్కోప్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై పోక్సో కింద తీవ్ర శిక్షలు ఉంటాయని తెలిపారు. ఆపద సమయాల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా 112 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.

​అనంతరం టోల్ ఫ్రీ నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించి, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు డి. భార్గవి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బి. నరసింహరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News