పాఠశాలలో పోక్సో, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్పై అవగాహన
విద్యార్థులు సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల సంస్కృతికి ఆకర్షితులు కాకుండా చదువుపైనే దృష్టి సారించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి సూచించారు.
మండలంలోని తంగడపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం డీసీపీయూ, జస్ట్ రైట్స్ చిల్డ్రన్ & స్కోప్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై పోక్సో కింద తీవ్ర శిక్షలు ఉంటాయని తెలిపారు. ఆపద సమయాల్లో చైల్డ్ హెల్ప్లైన్ 1098 లేదా 112 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.
అనంతరం టోల్ ఫ్రీ నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించి, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు డి. భార్గవి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బి. నరసింహరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి