Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:41 PM

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు
27-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠనగర్‌లో శ్రీ శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి 10వ వార్షిక బోనాల మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు గుర్రం నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నుండి మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో బయలుదేరి, బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రామాలయం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ​బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం చౌటుప్పల్ కర్చీరు వద్ద శ్రీ శ్రీ మద్దెలమ్మ మాత నాట్య కళామండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ‘సారంగధర’ యక్షగాన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ​ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామి, నాయకులు బడుగు లక్ష్మయ్య, బడుగు జయప్రకాష్, గోశిక అంజయ్య, వనం రాజు, చిక్క నరహరి, గోశిక కరుణాకర్, పెద్ది కృష్ణ, కందగట్ల ఆనంద్, పిల్లలమర్రి యాదగిరి, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, గోశిక పాండు, శాంతి శ్రీ, కోడి వనిత, బడుగు పావని, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, గోశిక రవి, గజం బృహ మహర్షి, కోడి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు

Article Image

మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠనగర్‌లో శ్రీ శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి 10వ వార్షిక బోనాల మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు గుర్రం నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నుండి మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో బయలుదేరి, బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రామాలయం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ​బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం చౌటుప్పల్ కర్చీరు వద్ద శ్రీ శ్రీ మద్దెలమ్మ మాత నాట్య కళామండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ‘సారంగధర’ యక్షగాన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ​ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామి, నాయకులు బడుగు లక్ష్మయ్య, బడుగు జయప్రకాష్, గోశిక అంజయ్య, వనం రాజు, చిక్క నరహరి, గోశిక కరుణాకర్, పెద్ది కృష్ణ, కందగట్ల ఆనంద్, పిల్లలమర్రి యాదగిరి, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, గోశిక పాండు, శాంతి శ్రీ, కోడి వనిత, బడుగు పావని, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, గోశిక రవి, గజం బృహ మహర్షి, కోడి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News