మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠనగర్లో శ్రీ శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి 10వ వార్షిక బోనాల మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు గుర్రం నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నుండి మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో బయలుదేరి, బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రామాలయం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం చౌటుప్పల్ కర్చీరు వద్ద శ్రీ శ్రీ మద్దెలమ్మ మాత నాట్య కళామండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ‘సారంగధర’ యక్షగాన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామి, నాయకులు బడుగు లక్ష్మయ్య, బడుగు జయప్రకాష్, గోశిక అంజయ్య, వనం రాజు, చిక్క నరహరి, గోశిక కరుణాకర్, పెద్ది కృష్ణ, కందగట్ల ఆనంద్, పిల్లలమర్రి యాదగిరి, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, గోశిక పాండు, శాంతి శ్రీ, కోడి వనిత, బడుగు పావని, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, గోశిక రవి, గజం బృహ మహర్షి, కోడి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
మణికంఠనగర్లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు
మణికంఠనగర్లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు
K.RAVI
మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠనగర్లో శ్రీ శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి 10వ వార్షిక బోనాల మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు గుర్రం నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నుండి మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో బయలుదేరి, బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రామాలయం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం చౌటుప్పల్ కర్చీరు వద్ద శ్రీ శ్రీ మద్దెలమ్మ మాత నాట్య కళామండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ‘సారంగధర’ యక్షగాన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామి, నాయకులు బడుగు లక్ష్మయ్య, బడుగు జయప్రకాష్, గోశిక అంజయ్య, వనం రాజు, చిక్క నరహరి, గోశిక కరుణాకర్, పెద్ది కృష్ణ, కందగట్ల ఆనంద్, పిల్లలమర్రి యాదగిరి, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, గోశిక పాండు, శాంతి శ్రీ, కోడి వనిత, బడుగు పావని, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, గోశిక రవి, గజం బృహ మహర్షి, కోడి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి