చండూరు మార్కెట్ యార్డులో చోరీ కేసు ఛేదన – 11 మంది అరెస్ట్.
నల్గొండ: చండూరు మార్కెట్ యార్డులోని గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించగా, వారిలో 11 మందిని అరెస్ట్ చేసినట్లు చండూరు సీఐ రాము తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
నిందితుల నుంచి రూ.9.80 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం, 11 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళంతో మార్కెట్ యార్డు గోదాంలోకి ప్రవేశించిన నిందితులు అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని అపహరించినట్లు విచారణలో వెల్లడైంది.చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించి నగదుగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు ఛేదనలో చండూరు పోలీసులు కీలకంగా వ్యవహరించినట్లు సీఐ రాము వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి