శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణ మహాయజ్ఞం
శ్రావణ మాసం సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గ ఆర్యసమాజ్ అధ్యక్షుడు రామచంద్రయ్య మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 34 మంది దంపతులతో పాటు భక్తులు పాల్గొన్నారు.
ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని సంకల్పంతో యజ్ఞం నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేదపండితుడు సంతోష్ మంత్రోచ్ఛరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.ప్రముఖ కళాకారుడు చంద్రశేఖర్ ఆలపించిన భక్తిగేయాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్ ప్రతినిధులు, స్థానిక భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి