Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌత్‌-ఈస్ట్‌ ఏషియన్‌ కప్‌కు తెలంగాణ నుంచి ముగ్గురు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:06 AM

న్యాల్కల్‌లో మహాయజ్ఞం.. 34 మంది దంపతులతో ఘనంగా యజ్ఞం

న్యాల్కల్‌లో మహాయజ్ఞం.. 34 మంది దంపతులతో ఘనంగా యజ్ఞం

న్యాల్కల్‌లో మహాయజ్ఞం.. 34 మంది దంపతులతో ఘనంగా యజ్ఞం
27-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణ మహాయజ్ఞం


శ్రావణ మాసం సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గ ఆర్యసమాజ్ అధ్యక్షుడు రామచంద్రయ్య మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 34 మంది దంపతులతో పాటు భక్తులు పాల్గొన్నారు.

ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని సంకల్పంతో యజ్ఞం నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేదపండితుడు సంతోష్ మంత్రోచ్ఛరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.ప్రముఖ కళాకారుడు చంద్రశేఖర్ ఆలపించిన భక్తిగేయాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్ ప్రతినిధులు, స్థానిక భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు.

Sthanikam

న్యాల్కల్‌లో మహాయజ్ఞం.. 34 మంది దంపతులతో ఘనంగా యజ్ఞం

Article Image

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణ మహాయజ్ఞం


శ్రావణ మాసం సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గ ఆర్యసమాజ్ అధ్యక్షుడు రామచంద్రయ్య మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 34 మంది దంపతులతో పాటు భక్తులు పాల్గొన్నారు.

ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని సంకల్పంతో యజ్ఞం నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేదపండితుడు సంతోష్ మంత్రోచ్ఛరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.ప్రముఖ కళాకారుడు చంద్రశేఖర్ ఆలపించిన భక్తిగేయాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్ ప్రతినిధులు, స్థానిక భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News