రామన్నపేట
కల్లుగీత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య సేఫ్టీ మోకుల వినియోగంపై రామన్నపేట పట్టణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటి చెట్లు ఎక్కే సమయంలో సేఫ్టీ మోకులను ఎలా ఉపయోగించాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో అధికారులు, నాయకులు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికులు వృత్తిలో తప్పనిసరిగా భద్రతా పరికరాలను వినియోగించాలని సూచించారు. కాటమయ్య సేఫ్టీ మోకులు కార్మికుల ప్రమాదాలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి, ప్రతి కార్మికుడికి సేఫ్టీ పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్, ఎస్సైలు శంకర్, శివకృష్ణ, కానిస్టేబుల్ కృష్ణ, బీసీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ వెంకన్న, యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి భావనలపల్లి బాలరాజు, రామన్నపేట మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, కాసాని సత్తయ్య, సైదులు, పొడిచేటి వీరయ్య, తండు శివశంకర్, సొసైటీ అధ్యక్షుడు బైరు శంకరయ్య, ఎర్ర వెంకటేశం, అంతటి దశరథ, గుండాల యాదయ్య, జహంగీర్, మల్లేశం, అశోక్, గోపగోని ధర్మరాజుతో పాటు కల్లుగీత కార్మికులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి