Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:50 PM

రామన్నపేటలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ మోకులపై శిక్షణ

రామన్నపేటలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ మోకులపై శిక్షణ

రామన్నపేటలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ మోకులపై శిక్షణ
26-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

కల్లుగీత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య సేఫ్టీ మోకుల వినియోగంపై రామన్నపేట పట్టణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటి చెట్లు ఎక్కే సమయంలో సేఫ్టీ మోకులను ఎలా ఉపయోగించాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో అధికారులు, నాయకులు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికులు వృత్తిలో తప్పనిసరిగా భద్రతా పరికరాలను వినియోగించాలని సూచించారు. కాటమయ్య సేఫ్టీ మోకులు కార్మికుల ప్రమాదాలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి, ప్రతి కార్మికుడికి సేఫ్టీ పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్, ఎస్సైలు శంకర్, శివకృష్ణ, కానిస్టేబుల్ కృష్ణ, బీసీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ వెంకన్న, యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి భావనలపల్లి బాలరాజు, రామన్నపేట మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, కాసాని సత్తయ్య, సైదులు, పొడిచేటి వీరయ్య, తండు శివశంకర్, సొసైటీ అధ్యక్షుడు బైరు శంకరయ్య, ఎర్ర వెంకటేశం, అంతటి దశరథ, గుండాల యాదయ్య, జహంగీర్, మల్లేశం, అశోక్, గోపగోని ధర్మరాజుతో పాటు కల్లుగీత కార్మికులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ మోకులపై శిక్షణ

Article Image

రామన్నపేట

కల్లుగీత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య సేఫ్టీ మోకుల వినియోగంపై రామన్నపేట పట్టణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటి చెట్లు ఎక్కే సమయంలో సేఫ్టీ మోకులను ఎలా ఉపయోగించాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో అధికారులు, నాయకులు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికులు వృత్తిలో తప్పనిసరిగా భద్రతా పరికరాలను వినియోగించాలని సూచించారు. కాటమయ్య సేఫ్టీ మోకులు కార్మికుల ప్రమాదాలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి, ప్రతి కార్మికుడికి సేఫ్టీ పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్, ఎస్సైలు శంకర్, శివకృష్ణ, కానిస్టేబుల్ కృష్ణ, బీసీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ వెంకన్న, యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి భావనలపల్లి బాలరాజు, రామన్నపేట మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, కాసాని సత్తయ్య, సైదులు, పొడిచేటి వీరయ్య, తండు శివశంకర్, సొసైటీ అధ్యక్షుడు బైరు శంకరయ్య, ఎర్ర వెంకటేశం, అంతటి దశరథ, గుండాల యాదయ్య, జహంగీర్, మల్లేశం, అశోక్, గోపగోని ధర్మరాజుతో పాటు కల్లుగీత కార్మికులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News