సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానికులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా సంఘటన ప్రాంతంలో స్థానిక పోలీస్ అధికారులు, రెవెన్యూ , వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి