రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు.
మంగళవారం అందిన నమ్మదగిన సమాచారం మేరకు పి.డి.ఓ/ఏఎస్ఐ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో పెట్రోల్ మొబైల్ సిబ్బంది పిసి-3554 ఎం. సందీప్, ఏఆర్పిసి-7967 ఎల్. సీతారాం రెడ్డిలతో కలిసి చౌటుప్పల్ వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఒక వాహనాన్ని ఆపి విచారించారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు విక్రయించడానికి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. వాహన డ్రైవర్ లావుడ్య శ్రీనివాస్ (30), వాహన సహాయకుడు గుగులోతు అరుణ్ (18)లను అదుపులోకి తీసుకుని, 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ వివరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి