Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డెడ్ స్టోరేజ్‌లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:05 AM

చౌటుప్పల్ వద్ద 25 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం సీజ్: ఇద్దరిపై కేసు నమోదు

చౌటుప్పల్ వద్ద 25 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం సీజ్: ఇద్దరిపై కేసు నమోదు

చౌటుప్పల్ వద్ద 25 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం సీజ్: ఇద్దరిపై కేసు నమోదు
26-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

​మంగళవారం అందిన నమ్మదగిన సమాచారం మేరకు పి.డి.ఓ/ఏఎస్ఐ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో పెట్రోల్ మొబైల్ సిబ్బంది పిసి-3554 ఎం. సందీప్, ఏఆర్‌పిసి-7967 ఎల్. సీతారాం రెడ్డిలతో కలిసి చౌటుప్పల్ వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఒక వాహనాన్ని ఆపి విచారించారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు విక్రయించడానికి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. వాహన డ్రైవర్ లావుడ్య శ్రీనివాస్ (30), వాహన సహాయకుడు గుగులోతు అరుణ్ (18)లను అదుపులోకి తీసుకుని, 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ వివరించారు.

Sthanikam

చౌటుప్పల్ వద్ద 25 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం సీజ్: ఇద్దరిపై కేసు నమోదు

Article Image

రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

​మంగళవారం అందిన నమ్మదగిన సమాచారం మేరకు పి.డి.ఓ/ఏఎస్ఐ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో పెట్రోల్ మొబైల్ సిబ్బంది పిసి-3554 ఎం. సందీప్, ఏఆర్‌పిసి-7967 ఎల్. సీతారాం రెడ్డిలతో కలిసి చౌటుప్పల్ వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఒక వాహనాన్ని ఆపి విచారించారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు విక్రయించడానికి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. వాహన డ్రైవర్ లావుడ్య శ్రీనివాస్ (30), వాహన సహాయకుడు గుగులోతు అరుణ్ (18)లను అదుపులోకి తీసుకుని, 25 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News