Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణ

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణ

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణ
25-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండలం ఇందిరానగర్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంఘాల బలోపేతం, నిర్వహణ, మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఎస్‌పీఎం బీమయ్య, డీపీఎం జాన్ కెన్నెడీ, ఏపీఎం శివకుమార్ పాల్గొని మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సంఘ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం, పొదుపు పెంచుకోవడం, అంతర్గత రుణాలను సద్వినియోగం చేసుకోవడం, సంఘ రికార్డులను సక్రమంగా నిర్వహించడం, సభ్యులందరి భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని సంఘాలను మరింత బలోపేతం చేసుకోవాలని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వంశీకృష్ణ, సీసీ కల్పన, సీఆర్‌పీలు సంధ్యారాణి, ప్రమీల, వీఓఏ శంకర్ నాయక్, వీఓ అధ్యక్షురాలు లక్ష్మీతో పాటు ఇందిరానగర్ స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండలం ఇందిరానగర్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంఘాల బలోపేతం, నిర్వహణ, మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఎస్‌పీఎం బీమయ్య, డీపీఎం జాన్ కెన్నెడీ, ఏపీఎం శివకుమార్ పాల్గొని మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సంఘ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం, పొదుపు పెంచుకోవడం, అంతర్గత రుణాలను సద్వినియోగం చేసుకోవడం, సంఘ రికార్డులను సక్రమంగా నిర్వహించడం, సభ్యులందరి భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని సంఘాలను మరింత బలోపేతం చేసుకోవాలని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వంశీకృష్ణ, సీసీ కల్పన, సీఆర్‌పీలు సంధ్యారాణి, ప్రమీల, వీఓఏ శంకర్ నాయక్, వీఓ అధ్యక్షురాలు లక్ష్మీతో పాటు ఇందిరానగర్ స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News