Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:15 PM

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్
25-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అడవులు, గుట్టల్లో పండ్ల చెట్లు పెంచాలి: సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం యాదవ్

చిట్యాల: మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ. మల్లేశం హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు విరివిగా పెంచితే వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. కోతుల బెడదను నివారించేందుకు అడవులు, గుట్టల్లో పండ్ల చెట్లను పెద్ద ఎత్తున పెంచాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అలేందర్‌రెడ్డి, ఫారెస్ట్ బీట్ అధికారులు శిరీష, భవాని, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, స్వాతి, పూలమ్మ, సుస్మిత, మమత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్

Article Image

అడవులు, గుట్టల్లో పండ్ల చెట్లు పెంచాలి: సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం యాదవ్

చిట్యాల: మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ. మల్లేశం హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు విరివిగా పెంచితే వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. కోతుల బెడదను నివారించేందుకు అడవులు, గుట్టల్లో పండ్ల చెట్లను పెద్ద ఎత్తున పెంచాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అలేందర్‌రెడ్డి, ఫారెస్ట్ బీట్ అధికారులు శిరీష, భవాని, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, స్వాతి, పూలమ్మ, సుస్మిత, మమత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News