నార్కట్పల్లి: డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న స్థావరంపై నార్కట్పల్లి పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గోపాలాయపల్లి గ్రామ శివారులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.గోపాలాయపల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు నగదు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో నార్కట్పల్లి ఎస్ఐ పి. విష్ణుమూర్తి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.4,620 నగదు, ఆరు సెల్ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారు: ఎడవల్లి గ్రామానికి చెందిన ఎడమ సత్తయ్య, వణిపాకల గ్రామానికి చెందిన మామిడి లింగస్వామి, నేరడ గ్రామానికి చెందిన పాలకూరి లక్ష్మణ్, చిట్యాల గ్రామానికి చెందిన బోలుగూరి నాగరాజు, గాదె శంకరయ్య, వణి పాకల గ్రామానికి చెందిన మేడి ఎల్లేష్గా పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఎస్ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి