Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:16 PM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్.
24-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి: డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న స్థావరంపై నార్కట్‌పల్లి పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గోపాలాయపల్లి గ్రామ శివారులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.గోపాలాయపల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు నగదు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో నార్కట్‌పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.4,620 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారు: ఎడవల్లి గ్రామానికి చెందిన ఎడమ సత్తయ్య, వణిపాకల గ్రామానికి చెందిన మామిడి లింగస్వామి, నేరడ గ్రామానికి చెందిన పాలకూరి లక్ష్మణ్, చిట్యాల గ్రామానికి చెందిన బోలుగూరి నాగరాజు, గాదె శంకరయ్య, వణి పాకల గ్రామానికి చెందిన మేడి ఎల్లేష్‌గా పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్.

Article Image

నార్కట్‌పల్లి: డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న స్థావరంపై నార్కట్‌పల్లి పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గోపాలాయపల్లి గ్రామ శివారులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.గోపాలాయపల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు నగదు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో నార్కట్‌పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.4,620 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారు: ఎడవల్లి గ్రామానికి చెందిన ఎడమ సత్తయ్య, వణిపాకల గ్రామానికి చెందిన మామిడి లింగస్వామి, నేరడ గ్రామానికి చెందిన పాలకూరి లక్ష్మణ్, చిట్యాల గ్రామానికి చెందిన బోలుగూరి నాగరాజు, గాదె శంకరయ్య, వణి పాకల గ్రామానికి చెందిన మేడి ఎల్లేష్‌గా పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News