Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 07:33 PM

రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం

రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం

రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి  డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం
24-08-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో బోరంచ గ్రామానికి చెందిన దీపక్ రెడ్డి బీడుగా ఉన్న రాతి నేలను సాగు భూమిగా మార్చేందుకు రూపొందించిన వినూత్న యంత్రాన్ని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా ప్రధాన మైనోద్దీన్ దీపక్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా కొత్త ఆలోచనతో యంత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. బీడుగా ఉన్న రాతి భూములను సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం దీపక్ రెడ్డి తండ్రి బోజిరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రూపొందించిన ఈ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.

Sthanikam

రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో బోరంచ గ్రామానికి చెందిన దీపక్ రెడ్డి బీడుగా ఉన్న రాతి నేలను సాగు భూమిగా మార్చేందుకు రూపొందించిన వినూత్న యంత్రాన్ని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా ప్రధాన మైనోద్దీన్ దీపక్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా కొత్త ఆలోచనతో యంత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. బీడుగా ఉన్న రాతి భూములను సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం దీపక్ రెడ్డి తండ్రి బోజిరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రూపొందించిన ఈ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News