నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో బోరంచ గ్రామానికి చెందిన దీపక్ రెడ్డి బీడుగా ఉన్న రాతి నేలను సాగు భూమిగా మార్చేందుకు రూపొందించిన వినూత్న యంత్రాన్ని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా ప్రధాన మైనోద్దీన్ దీపక్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా కొత్త ఆలోచనతో యంత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. బీడుగా ఉన్న రాతి భూములను సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం దీపక్ రెడ్డి తండ్రి బోజిరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రూపొందించిన ఈ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.
రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం
రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో బోరంచ గ్రామానికి చెందిన దీపక్ రెడ్డి బీడుగా ఉన్న రాతి నేలను సాగు భూమిగా మార్చేందుకు రూపొందించిన వినూత్న యంత్రాన్ని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా ప్రధాన మైనోద్దీన్ దీపక్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా కొత్త ఆలోచనతో యంత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. బీడుగా ఉన్న రాతి భూములను సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం దీపక్ రెడ్డి తండ్రి బోజిరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రూపొందించిన ఈ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి