Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి: చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌ బుడ్డ సురేష్ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 07:17 PM

నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
12-08-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ పరిధిలో అసంపూర్తిగా ఉన్న ఎన్‌హెచ్‌–161(బి) జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి రిమైండర్ లేఖ రాశారు. నిజాంపేట్–నారాయణఖేడ్–బీదర్ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 4.50 కి.మీ నుంచి 8.00 కి.మీ వరకు ఉన్న సుమారు 3.50 కి.మీ రహదారి భాగం ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చకపోవడంతో పట్టణంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎంపీ తెలిపారు. రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మిగిలిన రహదారి భాగాన్ని ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చి, రహదారి విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పనులు పూర్తయితే నారాయణఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు తెలంగాణ–కర్ణాటక మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. గతంలో ఇచ్చిన వినతిపై సానుకూలంగా స్పందించి అధికారులను పరిశీలనకు ఆదేశించినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిశీలనను త్వరగా పూర్తి చేసి, పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కోరారు.

Sthanikam

నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ పట్టణ పరిధిలో అసంపూర్తిగా ఉన్న ఎన్‌హెచ్‌–161(బి) జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి రిమైండర్ లేఖ రాశారు. నిజాంపేట్–నారాయణఖేడ్–బీదర్ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 4.50 కి.మీ నుంచి 8.00 కి.మీ వరకు ఉన్న సుమారు 3.50 కి.మీ రహదారి భాగం ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చకపోవడంతో పట్టణంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎంపీ తెలిపారు. రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మిగిలిన రహదారి భాగాన్ని ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చి, రహదారి విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పనులు పూర్తయితే నారాయణఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు తెలంగాణ–కర్ణాటక మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. గతంలో ఇచ్చిన వినతిపై సానుకూలంగా స్పందించి అధికారులను పరిశీలనకు ఆదేశించినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిశీలనను త్వరగా పూర్తి చేసి, పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News