నారాయణఖేడ్ పట్టణ పరిధిలో అసంపూర్తిగా ఉన్న ఎన్హెచ్–161(బి) జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి రిమైండర్ లేఖ రాశారు. నిజాంపేట్–నారాయణఖేడ్–బీదర్ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 4.50 కి.మీ నుంచి 8.00 కి.మీ వరకు ఉన్న సుమారు 3.50 కి.మీ రహదారి భాగం ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చకపోవడంతో పట్టణంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎంపీ తెలిపారు. రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మిగిలిన రహదారి భాగాన్ని ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చి, రహదారి విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పనులు పూర్తయితే నారాయణఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు తెలంగాణ–కర్ణాటక మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. గతంలో ఇచ్చిన వినతిపై సానుకూలంగా స్పందించి అధికారులను పరిశీలనకు ఆదేశించినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిశీలనను త్వరగా పూర్తి చేసి, పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కోరారు.
నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
Krishna
నారాయణఖేడ్ పట్టణ పరిధిలో అసంపూర్తిగా ఉన్న ఎన్హెచ్–161(బి) జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి రిమైండర్ లేఖ రాశారు. నిజాంపేట్–నారాయణఖేడ్–బీదర్ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 4.50 కి.మీ నుంచి 8.00 కి.మీ వరకు ఉన్న సుమారు 3.50 కి.మీ రహదారి భాగం ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చకపోవడంతో పట్టణంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎంపీ తెలిపారు. రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మిగిలిన రహదారి భాగాన్ని ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చి, రహదారి విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పనులు పూర్తయితే నారాయణఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు తెలంగాణ–కర్ణాటక మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. గతంలో ఇచ్చిన వినతిపై సానుకూలంగా స్పందించి అధికారులను పరిశీలనకు ఆదేశించినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిశీలనను త్వరగా పూర్తి చేసి, పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి