చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు, అర్హులైన వారందరికీ అన్ని రకాల పెన్షన్లను తక్షణమే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎండి పాషా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో పెన్షన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నిధుల కొరత నెపంతో వృద్ధాప్య పెన్షన్లను నిలిపివేసి, ఇతర పెన్షన్లను మాత్రమే ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, నాయకులు బండారు నరసింహ, ఆకుల ధర్మయ్య, గోపగోని లక్ష్మణ్ గౌడ్, బత్తుల శ్రీశైలం గౌడ్, భావన్ల పెళ్లి స్వామి, బత్తుల లక్ష్మయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, సిల్వేరు జంగయ్య, మగుదల రాములు, బాబు, బిక్షపతి, తోర్పునూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి – సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా
అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి – సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు, అర్హులైన వారందరికీ అన్ని రకాల పెన్షన్లను తక్షణమే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎండి పాషా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో పెన్షన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నిధుల కొరత నెపంతో వృద్ధాప్య పెన్షన్లను నిలిపివేసి, ఇతర పెన్షన్లను మాత్రమే ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, నాయకులు బండారు నరసింహ, ఆకుల ధర్మయ్య, గోపగోని లక్ష్మణ్ గౌడ్, బత్తుల శ్రీశైలం గౌడ్, భావన్ల పెళ్లి స్వామి, బత్తుల లక్ష్మయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, సిల్వేరు జంగయ్య, మగుదల రాములు, బాబు, బిక్షపతి, తోర్పునూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి