Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 01:20 PM

కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య

కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య

కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య
12-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఘాతుకం.. నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ మృతి.


కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలంలోని జేబీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొండమల్లేపల్లికి చెందిన రూపారెడ్డి (45) మృతిచెందారు. ఆమె స్థానిక నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆమె భర్త ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని సంప్రదించగా ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి పరిశీలించగా రూపారెడ్డి మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాత కక్షలు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Sthanikam

కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య

Article Image

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఘాతుకం.. నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ మృతి.


కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలంలోని జేబీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొండమల్లేపల్లికి చెందిన రూపారెడ్డి (45) మృతిచెందారు. ఆమె స్థానిక నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆమె భర్త ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని సంప్రదించగా ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి పరిశీలించగా రూపారెడ్డి మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాత కక్షలు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News