చైతన్యపురి:
మూసీ నదిలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మధ్యాహ్నం వినాయకనగర్, సత్యనగర్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ వెనుక ఉన్న మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ ఉన్నట్లు డయల్-100కు సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు.
మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి