సుశీలమ్మ ఫౌండేషన్ సేవలపై ప్రశంసలు
గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో కొనియాడదగినవని12 వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ అన్నారు. ఇటీవల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న బాధితులకు, ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చిన్నకొండూరు సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, వార్డు మెంబర్ భాను ప్రకాష్ హాజరై లబ్ధిదారులకు అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు ఉచితంగా కంటి అద్దాలు అందించడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజలకు ఇలాంటి సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి